కిరాయి కట్టలేదని MPDO ఆఫీసుకు తాళం

కిరాయి కట్టలేదని MPDO ఆఫీసుకు తాళం

కరీంనగర్: అద్దె చెల్లించడం లేదని ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేశాడు ఆ భవన యాజమాని. మండలాల విభజనలో భాగంగా కరీంనగర్ జిల్లాలో గన్నేరువరం మండలం నూతనంగా ఏర్పడింది. ఆ మండలానికి కావలసిన కార్యాలయాలను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దాంతో మండల ఎంపీడీవో కార్యాలయం కోసం నెలకు రూ. 12,500 అద్దె చొప్పున జూలై 2019లో ఓ బిల్డింగ్‎ను అద్దెకు తీసుకున్నారు. అప్పటి నుంచి 11 నెలలు కిరాయి చెల్లించిన ప్రభుత్వం.. గత 18 నెలల కిరాయి చెల్లించలేదు. దాంతో బిల్డింగ్ యజమాని ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేశాడు. తనకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని అడిగితే.. అధికారులు కాలం వెల్లదీస్తున్నారని బిల్డింగ్ యాజమాని తిరుపతి వాపోతున్నాడు.  అద్దె రూపంలో తనకు ఇంకా రెండు లక్షల ఇరవై ఐదు వేల కిరాయి రావాలని తిరుపతి తెలిపాడు. అవి ఇచ్చేంతవరకు ఎంపీడీవో కార్యాలయానికి తాళం తీసేది లేదని భీష్మించుకుని కూర్చున్నాడు.