మునుగోడులో మతతత్వ పార్టీలకు స్థానం లేదు

మునుగోడులో మతతత్వ పార్టీలకు స్థానం లేదు

హైదరాబాద్:  మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం ఖాయమని ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు బైపోల్ ను హుజూరాబాద్ తో పోల్చొద్దన్న ఆయన... దానికి దీనికి అసలు సంబంధమే లేదన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులకు మునుగోడు కంచు కోట అని తెలిపారు. మత తత్వ పార్టీలకు మునుగోడులో స్థానం లేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్న ఉత్తమ్... అవినీతి టీఆర్ఎస్ ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు సపోర్టు చేయాలని కమ్యూనిస్టులను కోరారు. 

తమకు ట్రెడిషనల్ ఓటు బ్యాంకు ఉందన్న ఉత్తమ్... కాంగ్రెస్ నేతలంతా కలిసి కట్టుగా పని చేసి మునుగోడు సిట్టింగ్ సీటును దక్కించుకుంటామని స్పష్టం చేశారు. ఇక వచ్చే జనరల్ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.