నిలదీసిన జనం.. నీళ్లంతా పోయాక ఇప్పుడా వచ్చేది

నిలదీసిన జనం.. నీళ్లంతా పోయాక ఇప్పుడా వచ్చేది
  • మంత్రి కేటీఆర్ ను నిలదీసిన ప్రజలు

కరీంనగర్: వాన నీళ్లంతా వెళ్లిపోయాక ఇప్పుడా వచ్చేది.. అంటూ మంత్రి కేటీఆర్ ను మహిళలు నిలదీశారు. బుధవారం సిరిసిల్ల శాంతినగర్ లో చోటు చేసుకుందీ ఘటన. వాన నీళ్లతో కష్టాలుపడిన జనం మంత్రి కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. నీళ్లంతా వెళ్ళిపోయాక వస్తే ఏం లాభం.. ఉన్నప్పుడు  ఎందుకు రాలేదని పద్మ అనే మహిళ నిలదీసింది. 
కష్టం అనుభవిస్తేనే తెలుస్తుందా?  చూస్తే తెలియదా: కేటీఆర్
కష్టం అనుభవిస్తేనే తెలుస్తుందా?  చూస్తే తెలియదా అంటూ మహిళలను మంత్రి కేటీఆర్ ఎదురు ప్రశ్నించారు. గంటన్నరసేపు అధికారులతో మీటింగ్ పెట్టాను. మళ్లీ ఈ సమస్య రాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. గతంలో ఎప్పుడూ లేనంతగా వానలు పడటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వివరించారు కేటీఆర్. మున్సిపాలిటీ అధికారులు సరిగా పనిచేయడం లేదని, పన్నులు మాత్రం వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేసింది పద్మ. సమస్య శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లిపోయారు మంత్రి కేటీఆర్.