హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘డేంజరస్ (మా ఇష్టం)’చిత్రం వాయిదా పడింది. ఈ సినిమా విడుదలను ఆపేయాలంటూ సిటీ సివిల్ కోర్టు వర్మకు నోటీసులు పంపింది. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఆర్జీవీ తప్పించుకుంటున్నాడని నిర్మాత నట్టి కుమార్ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. వర్మ నుంచి తనకు రూ.5.29 కోట్లు రావాలని.. ప్రతి సినిమాకు రూ.50 లక్షలు ఇవ్వాలన్న నిబంధనలను ఆయన పాటించలేదని నట్టి కుమార్ పిటిషన్ లో ఆరోపించారు. దీంతో ఆర్జీవీ తీసిన డేంజరస్ రిలీజ్ను ఆపాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. కొన్ని కారణాల వల్ల మూవీని విడుదల చేయలేకపోతున్నామని.. లెస్బియన్ అంశం ఉన్నందున సినిమా రిలీజ్కు చాలా థియేటర్లు సహకరించడం లేదని ఆయన ట్వీట్ చేశారు. ఈ అన్యాయంపై పోరాటం సాగిస్తామన్నారు. మూవీకి సంబంధించి త్వరలో కొత్త రిలీజ్ డేట్ను ప్రకటిస్తామని పేర్కొన్నారు.
మా ఇష్టం DANGEROUS సినిమా విడుదల విషయం లో లెస్బియన్ సబ్జెక్ట్ మూలాన చాలా theaters non cooperation దృష్ట్యా సినిమా విడుదల పోస్ట్ పోన్ చేస్తున్నాము. అన్ని విధాలుగా ఈ అన్యాయం ని ఎలా ఎదుర్కోవాలో పరిశీలించి తగు చర్యలు తీసుకున్నా తరువాత మరో విడుదల తేదీ తెలియ చేస్తాను
— Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2022