కేసీఆర్ కుటుంబ వైభోగం వెనుక ఒక తరం విషాదం

కేసీఆర్ కుటుంబ వైభోగం వెనుక ఒక తరం విషాదం

హైదరాబాద్: అమరులు, ఉద్యమ కారుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణకు గులాబీ చీడ పట్టుకుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. నాడు డొక్కు సైకిళ్లు, విరిగిన కుర్చీలు ఉన్న కేసీఆర్ కుటుంబం.. నేడు నిజాంను మించిన ధనవంతులుగా మారిందన్నారు. కేసీఆర్ కుటుంబం అనుభవిస్తున్న వైభోగం వెనుక.. ఒక తరం విషాదం ఉందంటూ ట్వీట్ చేశారు. ‘చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరాయి. అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలతో ఆవిర్భవించిన తెలంగాణకు గులాబీ చీడ పట్టింది. నాడు డొక్కు సైకిళ్లు, విరిగిన కుర్చీల నుండి నేడు నిజాంను మించిన ధనవంతులుగా కల్వకుంట్ల కుటుంబం అవతరించింది. కేసీఆర్ కుటుంబ వైభోగం వెనుక ఒక తరం తెలంగాణ విషాదం ఉంది’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. వెలుగు దినపత్రికలో వచ్చిన బ్యానర్ వార్తను పోస్ట్ చేశారు.

 

 

ఇవి కూడా చదవండి

తెలంగాణకు కంచుకోట టీఆర్ఎస్

చైనాలో కఠిన లాక్ డౌన్ అమలు చేస్తున్నా.. పెరుగుతున్న కరోనా కేసులు

మే 6న జలసౌధలో కేఆర్ఎంబీ మీటింగ్

వీ6–వెలుగు పిటిషన్​పై హైకోర్టు కీలక ఆదేశాలు

చిరు వ్యాపారులపై గ్రీన్ ఫండ్ బాదుడు