
హైదరాబాద్, వెలుగు: బేసిక్ చార్జిపై సెస్తగ్గించాలని ఆర్టీసీ భావిస్తోంది. ఇటీవల టికెట్ ధరలు పెంచిన నేపథ్యంలో చిల్లర సమస్య లేకుండా రౌండప్ చేశారు. దీనికి ప్యాసింజర్ సెస్ యాడ్ కావడంతో టికెట్ ధర అబ్నార్మల్గా పెరిగిపోయింది. ఉదాహరణకు.. రూ.10 టికెట్కు కిలోమీటర్కు 20పైసల చొప్పున పెంచడంతో దూరాన్ని బట్టి రూ.15గా అయింది. ప్యాసింజర్ సెస్ ఒక రూపాయి యాడ్ చేస్తే రూ.16.. దీనిని రౌండప్ చేస్తే రూ.20 కి చేరింది. అంతకుముందు రూ.10 గా ఉన్న టికెట్ ధర ఇప్పుడు రూ.20 గా మారింది. దీంతో ప్యాసింజర్ సెస్ను ఇందులో చేర్చొద్దని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి డిసెంబర్ 30న విడుదలైన సర్క్యూలర్ తాజాగా బయటకు వచ్చింది. దీనిని అమలుచేస్తే కనీస చార్జి తిరిగి రూ.15 అయ్యే ఛాన్స్ ఉంది. డీలక్స్, సూపర్ లగ్జీరీ బస్ ఫేర్లకూ ఈ రూల్ వర్తించనుంది. అయితే, ఆర్టీసీ అధికారులు మాత్రం అది ఇంటర్నల్ సర్క్యూలర్ అని, టికెట్ ధరలు తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తుండటం గమనార్హం.