కాంగ్రెస్ స్ర్కీనింగ్ కమిటీ భేటీ.. త్వరలో మరోమారు మీటింగ్

కాంగ్రెస్ స్ర్కీనింగ్ కమిటీ భేటీ.. త్వరలో మరోమారు మీటింగ్
  • అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని జాబితా
  • త్వరలో మరోమారు మీటింగ్
  • ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి వెల్లడి 

కాంగ్రెస్ అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు ఉద్దేశించిన స్క్రీనింగ్ కమిటీ సమావేశం హోటల్ తాజ్ కృష్ణలో ముగిసింది. ఒక్కో నియోజకవర్గానికి ప్రయారిటీల వారీగా 1 నుంచి 3 పేర్లను ఎంపిక చేసేందుకు స్క్రీనింగ్ కమిటీ తొలి సమావేశం సెప్టెంబర్ 6వ తేదీన జరిగింది.

సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. త్వరలో మరో మారు భేటీ అయిన తర్వాత అభ్యర్థులను ఫైనల్ చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి పంపుతామని చెప్పారు. కోమటిరెడ్డి అలక విషయం తమకు తెలియదన్నారు. ఆయన పార్టీకి విధేయంగా ఉండే నాయకుడని చెప్పారు.