
న్యూఢిల్లీ: మన దేశ ఆధ్వర్యంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సీవో) సమ్మిట్ మంగళవారం వర్చువల్ గా జరగనుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరగనున్న ఈ మీటింగ్ లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాల్గొంటారు. ఈ సమావేశంలో ఇరాన్ కు పర్మనెంట్ మెంబర్ షిప్ ఇవ్వనున్నారు. అఫ్గానిస్తాన్, ఉక్రెయిన్లో పరిస్థితులు, రీజినల్ సెక్యూరిటీ, వ్యాపార సంబం ధాలపై మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది.
కాగా, ఎస్సీవోలో మన దేశం తో పాటు చైనా, రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్ 16న ఉజ్బెకిస్తాన్లో జరిగిన సమ్మిట్లో మన దేశం ఎస్ సీవో అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది.