తన చావుకు ముగ్గురు కారణమని సూసైడ్ నోట్

తన చావుకు ముగ్గురు కారణమని సూసైడ్ నోట్

ములుగు, వెలుగు: ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు పట్టణానికి చెందిన బరుపాటి సాయిసూర్య(28) తన అన్నతో కలిసి ములుగులో జిరాక్స్​సెంటర్​నిర్వహిస్తున్నాడు. బండారుపల్లికి చెందిన గూడెపు మౌనిక అనే యువతి సాయిసూర్య తనను ప్రేమించి మోసం చేశాడని ఆరోపిస్తూ ఇంటి ముందు నెల రోజులపాటు దీక్ష చేపట్టింది. ఈ విషయంపై పోలీసులు సాయిసూర్య, అతని తల్లి, అన్నలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. జైలుకు వెళ్లినవారు ఇటీవలే బెయిల్​పై వచ్చారు. దీంతో ఆవేదనకు గురైన సాయిసూర్య శుక్రవారం ఉదయం తమ పాత ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. తన చావుకు మౌనికతోపాటు ఆమె తల్లి లక్ష్మి, మరో వ్యక్తి భిక్షపతి కారణమని సూసైడ్​ నోట్​లో పేర్కొన్నాడు.