మంత్రి శ్రీనివాస్ గౌడ్​ ఎన్నిక వివాదంపై తీర్పు అక్టోబర్ 10కి వాయిదా

మంత్రి శ్రీనివాస్ గౌడ్​ ఎన్నిక వివాదంపై తీర్పు అక్టోబర్ 10కి వాయిదా

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై మంగళవారం (అక్టోబర్  10న) తీర్పు ప్రకటిస్తామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఆయన ఎన్నికపై దాఖలైన పిటిషన్ పై తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు.

మహబూబ్​ నగర్ ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదని రాఘవేందర్ రాజు అనే వ్యక్తి పిటిషన్​ వేసిన విషయం తెలిసిందే. 2018 ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్​ తప్పు అఫిడవిట్​ ఇచ్చారని పిటిషనర్ రాఘవేందర్ రాజు ఆరోపించారు.