లోన్ యాప్ లను బ్లాక్ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. న్యాయవాది కళ్యాణ్ దీప్ వేసిన పిల్ వేశారు. లోన్ యాప్ ల వల్ల బాధితులు సూసైడ్ చేసుకుంటున్నారన్నారు పిటిషనర్. దీనిపై విచారించిన హైకోర్టు.. యాప్ వేధింపులపై నివేదికను సమర్పించాలని డీజీపీని ఆదేశించిన కోర్టు…. వెంటనే వాటిని తొలగించేందుకు ప్లే స్టోర్ లను సంప్రదించాలని సూచించింది. యాప్ ల నిర్వాహకులను కట్టడి చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలంది. తదుపరి విచారణను మార్చి 18కి వాయిదా వేసింది ధర్మాసనం.
see more news