కస్టమర్ లా వచ్చి ఉంగరాల బాక్స్ తో పరార్

కస్టమర్ లా వచ్చి ఉంగరాల బాక్స్ తో పరార్

ముంబైలో వెరైటీగా చోరీకి పాల్పడ్డాడు ఓ దొంగ. ముందుగా రెక్కీ చేయటం.. కన్నం వేయటం ఎందుకనుకున్నాడో ఏమో.. దర్జాగా చేయాలని డిసైడయ్యాడు. ముఖానికి ఎలాగూ కరోనా మాస్క్ ఉండనే ఉంది.. ఏమౌతుందనుకున్నాడు. ఉదయమే కస్టమర్ లాగా జ్యుయలరీ షాపుకెళ్లాడు. ఉంగరాలు చూపించమని ఆర్డరేశాడు. దీంతో షాప్ ఓనర్ ఉంగరాల బాక్స్ నే ముందుపెట్టాడు. ఇంకొన్ని వెరైటీలు చూపించమన్నాడు దొంగ. షాప్ ఓనర్ వేరే బాక్స్ తెచ్చేలోపు ముందున్న ఉంగరాల బాక్స్ పట్టుకుని పరారయ్యాడు కంత్రీగాడు. ఇంకేముందు షాపు ఓనర్ వెనుక నుంచి పరుగెత్తినా లాభం లేకుండా పోయింది. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయింది.

ఒకే ట్యూషన్‌కు వెళ్లిన 91 మంది విద్యార్థులకు కరోనా