రాష్ట్రంలో దొంగలు రోజు రోజుకు తెలివి మీరిపోతున్నారు. స్మార్ట్గా ఆలోచిస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. యజమానుల కళ్లెదుటే..వారికే తెలియకుండానే దొంగతనాలు చేస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఓ దొంగ..వింతగా దొంగతనానికి పాల్పడ్డాడు..రూ. 50 వేలు ఎత్తుకెళ్లాడు.
స్మార్ట్ దొంగ...
కామారెడ్డి పట్టణంలోని కొత్త సాయిబాబా గుడి రోడ్డులో గల యాక్సిస్ బ్యాంకు ఏటీఎం మిషన్ చెడిపోవడంతో ఓ వ్యక్తికి బ్యాంకు సిబ్బంది కాల్ చేసి పిలిపించారు. అక్కడకు వచ్చిన సదరు వ్యక్తి.. ఏటీఎంను బాగు చేస్తున్నట్లు నమ్మించి ఏటీఎం మిషన్ లో నుంచి 50 వేల నగదును చాకచక్యంగా ఎత్తుకెళ్లాడు. దొంగ మెకానిక్ వెళ్లిన తర్వాత ఏటీఎంలో ఉన్న నగదును బ్యాంకు సిబ్బంది లెక్కించగా..50వేలు తక్కువగా వచ్చింది. దీంతో లబోదిబో మన్న బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..సీసీ కెమెరాల ద్వారా నిందితుడి కోసం గాలిస్తున్నారు