అమ్మవారి కిరీటం దొంగతనం కేసులో నిందితుడి పట్టివేత

అమ్మవారి కిరీటం దొంగతనం కేసులో నిందితుడి పట్టివేత

హైద్రాబాద్: ఈనెల 20న హైదరాబాద్‌లోని గన్‌ఫౌండ్రి‌లో ఉన్న దుర్గ భవాని ఆలయంలో వెండి కిరీటాన్ని ఎత్తుకెళ్లిన దొంగను అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దొంగతనం చేసింది కోఠికి చెందిన అద్వానీ కిరణ్ కుమార్‌‌గా పోలీసులు గుర్తించారు. అద్వానీ కిరణ్ కుమార్‌ను ఆయన ఇంట్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పులు తీర్చేందుకే కిరీటాన్ని దొంగిలించి, అమ్మినట్లు కిరణ్ విచారణలో ఒప్పుకున్నాడు. పోలీసులు కిరీటాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తల కోసం

అమ్మవారికి మొక్కాడు.. కిరీటం కొట్టేశాడు