తనను చంపేందుకు కుట్ర జరుగుతోంది

తనను చంపేందుకు కుట్ర జరుగుతోంది

ఎంపీ రేవంత్ రెడ్డి , ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వర్గం నుండి ప్రాణహాని ఉందంటూ ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడు జెరూసలేం మత్తయ్య రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు. ఓటుకు నోటు కేసులో తాను అప్రూవర్ గా మారినందుకు తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ క్రమంలోనే తనకు ఈడీ నుండి నోటీసులు వచ్చాయని తెలిపాడు. ఈ కేసులో తమను పావులుగా వాడుకొని రేవంత్ రెడ్డి ఇరికించారన్నాడు. ముఖ్య సూత్రధారులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు అని అన్నారు. ఈ కేసుతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులను సీబీఐకి అప్పగించి త్వరగా నిజాలను బయటపెట్టాలని ఆయన కోరారు. కేసు పూర్తైయ్యే వరకు తనకు రక్షణ కల్పించాలని హెచ్చార్సీను కోరినట్లు మత్తయ్య తెలిపారు.