ప్రజా ప్రతినిధుల కేసుల విచారణపై ఆందోళన అవసరం లేదు

ప్రజా ప్రతినిధుల కేసుల విచారణపై ఆందోళన అవసరం లేదు

ప్రత్యేక కోర్టులో ప్రజా ప్రతినిధుల కేసుల విచారణ వేగంగా చేపట్టాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్ దాఖలు చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సిబ్బందిని నియమించాలని కోరారు పిటిషనర్. పిల్ పై విచారణ చేపట్టిన సీజే జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం… ప్రాసిక్యూటర్లు, సిబ్బందిని నియమించాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని ఆదేశించామంది హైకోర్టు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని తెలిపింది. ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల విచారణకు పోలీసులు సహకరించడం లేదంటూ కోర్టుకు తెలిపారు లాయర్ సత్యం రెడ్డి.దీనిపై స్పందించి హైకోర్టు…ప్రత్యేక కోర్టుల నుంచి రోజూ నివేదికలు వస్తున్నాయంది. పోలీసులు సహకరించడం లేదని లాయర్లు ఎప్పుడూ నివేదించలేదంది. ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణపై ఎవరికీ ఆందోళన అవసరం లేదని..ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులను సుప్రీంకోర్టు, హైకోర్టు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయని తెలిపింది ధర్మాసనం. అంతేకాదు సుప్రీంకోర్టుకు నెలవారీ నివేదిక పంపిస్తున్నామంది.ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టు పరిధిలో ఉన్నందున ఈ అంశంపై మళ్లీ నోటీసులు అవసరం లేదని తెలిపింది హైకోర్టు.