
కంటెంట్ బాగుండి.. హ్యూమన్ ఎమోషన్స్ని టచ్ చేయగలిగితే ఆడియెన్స్ థియేటర్స్కి వస్తారనేది ‘కుబేర’ సినిమాతో మరోసారి ప్రూవ్ అయిందని చిరంజీవి అన్నారు. ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్లో శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్కి అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ ‘ఇందులో దేవ క్యారెక్టర్లో ధనుష్ని తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేం. ఈ సినిమాకు అతనికి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలి.. రాకపోతే అసలు నేషనల్ అవార్డు అనేదానికి అర్థమే లేదు. ఇక నాగార్జున చేసిన క్యారెక్టర్ నాలో స్ఫూర్తిని నింపింది. ఇలాంటి క్యారెక్టర్స్తో తను మరో 40 ఏళ్లు రాణిస్తారు. ఇక శేఖర్ కమ్ముల సినిమాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ఇందులోనూ పాత్రలే గుర్తుంటాయి’ అని చెప్పారు.
నాగార్జున మాట్లాడుతూ ‘ఇది శేఖర్ కమ్ముల ఫిల్మ్. థ్రిల్లర్, హ్యూమన్ ఎమోషన్తో సినిమా చేయడం మామూలు విషయం కాదు. అది ఈ సినిమాతో కుదిరింది’ అని అన్నారు. ధనుష్ మాట్లాడుతూ ‘యాక్షన్, బ్లాస్టింగ్స్ సీన్స్ ఉన్న సినిమాలే థియేటర్స్లో ఆడుతున్నాయని ఒక అపనమ్మకం ఉంది. కానీ ‘కుబేర’తో శేఖర్ కమ్ముల కొత్త నమ్మకాన్ని ఇచ్చారు. హ్యూమన్ ఎమోషన్స్ కంటే పెద్ద గ్రాండియర్ ఏది ఉండదు.
మా చిత్రంతో పాటు ఇటీవల వచ్చిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఇదే తరహాలో మెప్పించింది. కొత్త దర్శకులు భారీ సెట్స్, సీజీ షాట్స్ ఉండే సూపర్ హీరో సినిమాలు కాకుండా సూపర్ హ్యూమన్ ఎమోషన్ ఉన్న సినిమాలపై దృష్టి సారించాలి’ అని చెప్పాడు. ఒక ఫిలిం మేకర్గా ఈ చిత్రం గొప్ప బలాన్ని ఇచ్చిందని శేఖర్ కమ్ముల అన్నారు. హీరోయిన్ రష్మిక, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు సహా టీమ్ అంతా పాల్గొన్నారు.