లెఫ్ట్ సీట్లపై  ఇయ్యాల స్పష్టత!

లెఫ్ట్ సీట్లపై  ఇయ్యాల స్పష్టత!

హైదరాబాద్, వెలుగు: సీపీఎం, సీపీఐ పార్టీలకు కాంగ్రెస్ కేటాయించే సీట్లపై ఇవ్వాల స్పష్టత వచ్చే అవకాశముంది. రెండ్రోజుల్లో కాంగ్రెస్ సెంకడ్ లిస్టు రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు శుక్రవారం లెఫ్ట్ పార్టీ నేతలతో సమావేశం అవ్వనున్నట్లు తెలిసింది. ఇప్పటికే సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు, సీపీఎంకు మిర్యాలగూడ, వైరా సీట్లను కాంగ్రెస్ ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతుంది.

అయితే, దీనిపై ఇటు లెఫ్ట్ పార్టీలు గానీ, అటు కాంగ్రెస్ నేతలు గానీ ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. కాగా..మునుగోడు లేదా హుస్నాబాద్ స్థానాల కోసం సీపీఐ, పాలేరు కోసం సీపీఎం పట్టుపడుతున్నాయి. పొత్తుల చర్చలన్నీ  జాతీయ స్థాయిలోనే జరుగుతుండటంతో రాష్ట్ర నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ, కోరిన సీట్ల కోసం ఆయా పార్టీల జాతీయ నేతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.