హైదరాబాద్ లో చైన్ స్నాచన్లు రెచ్చిపోతున్నారు. చైన్ స్నాచింగ్ కు రోజుకో రూట్ ఎంచుకుంటున్నారు. ఒంటరి మహిళలు, వృద్ధులు కనిపిస్తే చాలు మాటువేసి మెడలోని ఆభరణాలు లాక్కుని పరారవుతున్నారు కేటుగాళ్లు.
లేటెస్ట్ గా నిజాంపేట్ ప్రశాంత్ నగర్ లో అద్దెకు ఇల్లు ఉందా అంటూ వెళ్లిన ఓ యువకుడు వృద్దురాలి మెడలో చైన్ లాక్కెళ్లిండు. వృద్దురాలని కూడా చూడకుండా ఆమె నోట్లో మైదా పిండి కుక్కి మేడలో చైన్ లాక్కెళ్లి పరారయ్యిండు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు.అయితే ఒంటరి మహిళలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని.. ఎవరైనా అనుమానంగా తిరుగుతుంటే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.