బీరు బాటిళ్ళు ఇవ్వలేదని కత్తితో పొడిచి చంపేసిన్రు

బీరు బాటిళ్ళు ఇవ్వలేదని కత్తితో  పొడిచి చంపేసిన్రు

హైదరాబాద్ మీర్ పేటలో దారుణం జరిగింది.  బీర్ బాటిళ్లు ఇవ్వనందుకు ఓ వ్యక్తిని  కత్తితో పొడిచి హత్య చేశారు అగంతకులు. సాయి వరప్రసాద్ అనే వ్యక్తి సోమవారం రాత్రి బీర్ బాటిళ్లు తీసుకుని జిల్లెల గూడ నుంచి వెళుతుండగా.. పల్లె నితీశ్ గౌడ్, కిరణ్ గౌడ్, సంతోష్ యాదవ్, పవన్ కొంతమంది యువకులు వరప్రసాద్ ను అడ్డుకుని.. బీరు బాటిళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరప్రసాద్ ఇవ్వకపోవడంతో కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. 

ALSO READ :టైటాన్ టూరిస్ట్ సబ్ మెర్సిబుల్ ప్రమాదానికి కారణాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు..

పల్లె నితీష్ గౌడ్ అనే వ్యక్తి తనతో పాటు తెచ్చుకున్న కత్తితో  సాయి వరప్రసాద్ పై దాడి చేశాడు. దీంతో వరప్రసాద్ అక్కడిక్కడే కుప్పకూలిపోవడంతో అతని స్నేహితులు హుటాహుటిన  హాస్పిటల్ కు తరలించారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వరప్రసాద్ కాసేపటి క్రితం చనిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.