కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్లోని సిక్కువాడీలోని ఓ ఇంట్లో శనివారం 30 తులాల బంగారం, రూ.లక్ష నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. స్వరణ్ సింగ్ గత నెల 29న కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ లోని కూతురు దగ్గరకు వెళ్లాడు. శనివారం బంధువులు ఇంటికి రాగా తలుపులు తెరిచి ఉండడంతో స్వరణ్ సింగ్ కు ఫోన్ చేశారు. వచ్చి చూడగా బీరువా లోపల ఉన్న లాకర్ పగలగొట్టి ఉంది.
అందులోని ఒక నెక్లెస్, రెండు బంగారు గాజులు, నాలుగు ఉంగరాలు, మూడు చైన్లు ఇలా 30 తులాల బంగారం, రూ.లక్ష నగదు, 84 వేల విలువ చేసే ఐఫోన్ కనిపించలేదు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు వన్ టౌన్ పోలీసులు తెలిపారు.