వరద బాధితుల ఇండ్లనూ వదలని దొంగలు

వరద బాధితుల ఇండ్లనూ వదలని  దొంగలు

గోదావరి వరద ఉధృతి స్వల్పంగా తగ్గుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 70 అడుగులుగా ఉంది. చాలా కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. వరద ఇండ్లలోకి దొంగలు వెళ్లి తమ విలువైన వస్తువులను చోరీ చేస్తున్నారని  ఆరోపిస్తున్నారు నిర్వాసితులు. తమను ఇండ్లలోకి వెళ్లనివ్వాలని..లేదా తమ  వస్తువులకు  కాపలా ఉండాలని  డిమాండ్ చేస్తున్నారు. ఓ వైపు వరదలతో ఆగమై ఉంటే ఉన్న వస్తువలను కూడా దొంగలు ఎత్తుకెళ్తే మేం ఎలా బతకాలని ఆదోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర బలగాలతో వాగ్వాదానికి దిగారు బాధితులు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వెంటనే అధికారులు తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.