ఈసారి కామన్​ పీపుల్​ థీమ్​తో రిపబ్లిక్​ డే వేడుకలు

ఈసారి కామన్​ పీపుల్​ థీమ్​తో రిపబ్లిక్​ డే వేడుకలు
  • వీవీఐపీల సీట్లలో వారికి ఆతిథ్యం
  • సెంట్రల్​ విస్టా, కర్తవ్యపథ్​ నిర్మాణ పనుల్లో పాల్గొన్న కూలీలకు ఆహ్వానం

న్యూఢిల్లీ : సామాన్యుల రిపబ్లిక్​ డేను మనం ఢిల్లీ గడ్డపై చూడబోతున్నాం. ఈసారి దేశ రాజధానిలో జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఇంతకుముందు వాటి కంటే వెరీ డిఫరెంట్​. ఎందుకంటే  ఈ సెలబ్రేషన్స్​ లో మెయిన్​ డయాస్​ ఎదుట ఉండే తొలి వరుసలో కూర్చోబోయే స్పెషల్​గెస్ట్స్​ జాబితాలో రిక్షావాలాలు, తోపుడు బండ్లపై కూరగాయలు అమ్ముకునేవారు, నిర్మాణ రంగ కార్మికులు, చిరువ్యాపారులు ఉన్నారు. ‘పార్టిసిపేషన్​ ఆఫ్​ ది కామన్​ పీపుల్’ థీమ్​ తో ఈ ఏడాది రిపబ్లిక్​ డేను జరుపుకుంటున్న నేపథ్యంలో సామాన్యులకు ముందువరుసలో కూర్చునే అవకాశాన్ని కల్పించారు. పార్లమెంటు సెంట్రల్​ విస్టా, కర్తవ్య పథ్​నిర్మాణ  పనుల్లో పాల్గొన్న కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో పాటు రిక్షావాలాలు, చిరువ్యాపారులు, కూరగాయలు అమ్ముకునేవారిని  జనవరి 26న వీవీఐపీ కుర్చీల్లో మనం చూడబోతున్నాం. ఆయా విభాగాల నుంచి ఎంపిక చేసిన వారందరికీ ఇప్పటికే ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. ఈసారి రిపబ్లిక్​ డే కార్యక్రమానికి ఈజిప్ట్​ అధ్యక్షుడు అబ్దెల్​ ఫత్తా అల్​ సీసీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈజిప్ట్​ కు చెందిన 120 మంది సభ్యుల సైనిక బృందం కూడా పరేడ్​లో ప్రదర్శన ఇవ్వనుంది.  19 దేశాలకు చెందిన 166 మంది క్యాడెట్లు, 32 మంది ఆర్మీ ఆఫీసర్లు పరేడ్​ లో పాల్గొననున్నారు. 

ఈసారి ఆహ్వానాలన్నీ.. డిజిటల్​ రూపంలోనే

రాజ్​పథ్​ పేరును కర్తవ్య పథ్​గా మార్చిన తర్వాత జరుగుతున్న తొలి రిపబ్లిక్​ డే పరేడ్ ఇదే. పరేడ్​ను చూసేందుకు వచ్చే వారి కోసం మొత్తం 42000 సీట్లు సిద్ధం  చేశారు. వీటిలో 32,000 టికెట్లను ఆన్​ లైన్​ లో బుకింగ్​ కోసం అందుబాటులో ఉంచారు. ఈసారి అతిథులు, ప్రేక్షకులకు జారీ చేసే ఆహ్వాన లేఖలు, టికెట్లను పూర్తిగా డిజిటలైజ్​ చేశారు. ఇందుకోసం https://aamantran.mod.gov.in/login అనే ప్రత్యేక పోర్టల్​ ను కేంద్ర ప్రభుత్వం లాంచ్​ చేసింది. రిపబ్లిక్​ డే పరేడ్​ టికెట్ల అమ్మకాలు, అడ్మిట్​ కార్డులు, పార్కింగ్​ లేబుల్స్ జారీ ఇవన్నీ దీని ద్వారానే జరుగుతాయి. ‘ఈ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ –టికెట్’​ కలిగిన వారందరూ జనవరి 26న పార్లమెంటు సమీపంలోని ఉద్యోగ్​ భవన్, సెంట్రల్​ సెక్రటేరియట్​ లకు ఫ్రీగా మెట్రో రైడ్స్​  చేయొచ్చు.