దక్షిణ మధ్య రైల్వేకు బెదిరింపు లెటర్

దక్షిణ మధ్య  రైల్వేకు బెదిరింపు లెటర్
  • వారంలో మరో ట్రైన్ యాక్సిడెంట్ జరగబోతుందంటూ హెచ్చరిక

సికింద్రాబాద్, వెలుగు: వారం రోజుల్లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇటీవల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం లాంటి మరో ఘోర దుర్ఘటన జరగబోతుందంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి రైల్వే అధికారులకు లెటర్ ​రాశాడు. హైదరాబాద్ – -ఢిల్లీ రూట్​లోనే ఆ యాక్సిడెంట్​ జరుగుతుందని హెచ్చరిస్తూ రాసిన లెటర్ ​నాలుగు రోజుల కింద సికింద్రాబాద్​ డివిజనల్ ​రైల్వే మేనేజర్‌‌‌‌కు పోస్టు ద్వారా అందింది. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 

కాగా ఇలాంటి బెదిరింపు లెటర్లు, ఫోన్​కాల్స్​తరచూ వస్తూనే ఉంటాయని రైల్వే ఆఫీసర్లు చెపుతున్నారు. అయితే ఆకాశ రామన్న లెటర్​ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది.