- వారంలో మరో ట్రైన్ యాక్సిడెంట్ జరగబోతుందంటూ హెచ్చరిక
సికింద్రాబాద్, వెలుగు: వారం రోజుల్లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇటీవల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం లాంటి మరో ఘోర దుర్ఘటన జరగబోతుందంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి రైల్వే అధికారులకు లెటర్ రాశాడు. హైదరాబాద్ – -ఢిల్లీ రూట్లోనే ఆ యాక్సిడెంట్ జరుగుతుందని హెచ్చరిస్తూ రాసిన లెటర్ నాలుగు రోజుల కింద సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్కు పోస్టు ద్వారా అందింది. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
కాగా ఇలాంటి బెదిరింపు లెటర్లు, ఫోన్కాల్స్తరచూ వస్తూనే ఉంటాయని రైల్వే ఆఫీసర్లు చెపుతున్నారు. అయితే ఆకాశ రామన్న లెటర్ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది.