చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

చిత్తూరు జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని గుండ్లగుట్టపల్లి దగ్గర ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఇవాళ(శనివారం) మధ్యాహ్నం సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వీరంతా తమిళనాడు నుంచి తెలంగాణకు కాంట్రాక్ట్‌ పనుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.