పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మండలం గంగానగర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని మరో లారీ ఢీ కొట్టింది. దీంతో పక్కనే వెళ్తున్న ఆటోపై ఒక లారీ బోల్తా పడటంతో ముగ్గురు అక్కడిక్కడే చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయలు అయ్యాయి. రాంనగర్ కు చెందిన షేక్ షకిల్ కుటుంబ సభ్యులు మంచిర్యాలలో ఫంక్షన్ కు వెళ్తుండగా.. గంగానగర్ ఫ్లైఓవర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. భార్య భర్తలతో పాటు చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది. ప్రమాదంలో చిక్కుక్కున్న మరో చిన్నారిని పోలీసులు బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
For More News..
కొనుగోలు కేంద్రాలు ఉంచాలా? తీసేయాలా?
కౌలు చెల్లించలేక.. అప్పులు తీర్చలేక రైతు సూసైడ్