బర్త్ డే కేక్ తీసుకొస్తూ  ముగ్గురు మైనర్లు మృతి

బర్త్ డే కేక్ తీసుకొస్తూ  ముగ్గురు మైనర్లు మృతి

హైదరాబాద్,వెలుగు: బర్త్ డే సెలబ్రేషన్​ కోసం కేక్ తీసుకొస్తున్న ముగ్గురు మైనర్లను వెహికల్ ఢీకొట్టడంతో వారు చనిపోయిన ఘటన చేవెళ్ల పరిధిలో జరిగింది. చేవెళ్లకు చెందిన జయవర్ధన్(17), విష్ణు(15), వరప్రసాద్(16) ముగ్గురూ ఫ్రెండ్స్. శుక్రవారం జయవర్ధన్ బర్త్ డే కావడంతో సెలబ్రేట్ చేసేందుకు విష్ణు, వరప్రసాద్ ప్లాన్ చేశారు. కేక్ కోసం విష్ణు,వరప్రసాద్, జయవర్దన్ ముగ్గురు కలిసి బైక్ పై వెళ్లారు. కేక్ తీసుకుని రాత్రి 7.30 గంటలకు తిరిగొస్తుండగా..వీరి బైక్ ను గుర్తుతెలియని వెహికల్ ఢీకొట్టింది. ముగ్గురు కిందపడ్డారు. తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు డెడ్ బాడీలను చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించారు. వారి పేరెంట్స్ కు సమాచారం అందించారు.