లాయర్ దంపతుల హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్

లాయర్ దంపతుల హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణి హత్య కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో A1 గా వెల్ది వసంత రావు, A2 కుంటా శ్రీనివాస్ , A3 అక్కపాక కుమార్ పేర్లు ఎఫ్ఐఆర్ లో నమోదయ్యాయి. నిందితులందరూ గుంజపడుగు గ్రామానికి చెందిన వారిగా పోలీసులు తేల్చారు. వామనరావు తండ్రి  గట్టు కిషన్ రావు ఫిర్యాదు మేరకు రామగిరి పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. రామగుండం సిపి సత్యనారాయణ మరి కొద్దిసేపటిలో మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.