గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక వైద్య సేవలు : వివేక్ వెంకటస్వామి

గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక వైద్య సేవలు : వివేక్ వెంకటస్వామి

ధర్మారం, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తేవడం అభినందనీయమని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేత, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలకేంద్రంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన సంజీవని ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు.

 ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలకు ఖరీదైన వైద్య సేవలకు అందించేందుకు గ్రామీణ ప్రాంతంలో అన్ని రకాల వసతులతో ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్న డాక్టర్ ప్రశాంత్, ఎండీ హఫీజ్‌‌‌‌‌‌‌‌ను అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు తిరుపతి రెడ్డి, కాడే సూర్యనారాయణ, రూప్లానాయక్, కొత్త నరసింహులు, దేవి జనార్ధన్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

గొల్లపల్లి, వెలుగు : గొల్లపల్లి మండలం గోవిందపల్లె గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్‌‌‌‌లో శుక్రవారం బీజేపీ మండల అధ్యక్షుడు కట్ట మహేశ్–- శరణ్య వివాహం జరిగింది. ఈ కార్యక్రామనికి చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. లీడర్లు బషీర్, వెంకటేశం, గంగాధర్, మహేష్, శ్రీనివాస్, వెంకటేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.