నెక్కొండ, వెలుగు: వరంగల్జిల్లా నెక్కొండ మండలంలోని మూడు తండాలో సర్పంచ్ బోడ బాలు సమక్షంలో సోమవారం నిర్వహించిన మహిళా సాధికారితపై నిర్వహించిన అవగాహన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. తండాల్లో లిక్కర్, గుడుంబా అమ్మినా, తాగినా రూ.5వేల జరిమానాతో పాటు కరెంట్ కట్ చేస్తామని పాలకవర్గం సభ్యులు నిర్ణయించారు.
