ముషీరాబాద్, వెలుగు: బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ల బకాయిలు రూ.8 వేల కోట్లు వెంటనే చెల్లించాలని, ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో నంబర్ 9ను తక్షణమే రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ 18 బీసీ సంఘాలు ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్కు పిలుపునిచ్చాయి.
ఈ విషయాన్ని ఎంపీ ఆర్.కృష్ణయ్య సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద 18 బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి ప్రకటించారు. బంద్కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజేందర్, ఎత్తిరి భీమ్రాజ్, గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
