భద్రాచలం ట్రైబల్ బీఎడ్​ కాలేజీ లెక్చరర్లకు డెమో క్లాసులు

భద్రాచలం ట్రైబల్ బీఎడ్​ కాలేజీ లెక్చరర్లకు డెమో క్లాసులు
  • పరిశీలించిన ఐటీడీఏ పీవో ప్రతీక్​జైన్​

భద్రాచలం, వెలుగు :  భద్రాచలంలోని ట్రైబల్​ బీఎడ్​ కాలేజీలో పనిచేస్తున్న గెస్ట్, కాంట్రాక్టు లెక్చరర్ల అకాడమిక్​ ఇయర్​ పర్ఫార్మెన్స్ ను  డెమో క్లాసుల ద్వారా ఐటీడీఏ పీవో ప్రతీక్​ జైన్ ​పరిశీలించారు.  వారిని కొనసాగించాలా లేదా అన్నది నిర్ణయించేందుకు శుక్రవారం సబ్జెక్టులవారీగా రివ్యూ చేశారు. కమిటీ సభ్యులు డీడీ ట్రైబల్​ వెల్ఫేర్​ మణెమ్మ, డీఈవో వెంకటేశ్వరాచారి, బీఎడ్​ కాలేజీ ప్రిన్సిపల్​ వీరూనాయక్​, డైట్​ కాలేజీ ప్రిన్సిపల్​ భవానీ, ఏసీఎంవో రమణయ్య, ఏటీడబ్ల్యూవో నర్సింహారావు, ఇతర లెక్చరర్లు డెమో క్లాసులు పరిశీలించారు.