జమ్మూ కశ్మీర్లో భారీగా పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కశ్మీర్లోని నాగరోటా దగ్గర పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో జైషే ఈ మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. తర్వాత ఘటన స్థలంలో భారీ మొత్తంలో పేలుడు పదార్ధాలను, అధునాతన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.