108సార్లు కంపాస్​తో పొడిచిన్రు

108సార్లు కంపాస్​తో పొడిచిన్రు
  • నాలుగో తరగతి పిల్లాడిపై తోటి విద్యార్థుల దారుణం
  •     మధ్యప్రదేశ్​లోని ఓ ప్రైవేటు స్కూల్​లో ఘటన

ఇండోర్: నాలుగో తరగతి చదువుతున్న నలుగురు చిన్నారుల మధ్య లొల్లి పుట్టింది. వాళ్లమధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, ముగ్గురు కలిసి జామెట్రీ కంపాస్​తో నాలుగో స్టూడెంట్​పై దాడి చేశారు. ఏకంగా 108 సార్లు కంపాస్​తో ఆ చిన్నారిని పొడిచారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం​ ఇండోర్​లోని ఓ ప్రైవేటు స్కూల్​లో పోయిన శుక్రవారం ఈ ఘటన జరిగింది. బాధిత చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా ఈ ఘటనపై స్పందించింది. నలుగురు పిల్లలు పదేండ్ల లోపువాళ్లేనని.. ఇంత చిన్నవయసులో దారుణంగా ప్రవర్తించడం ఏంటని కమిటీ చైర్​పర్స్ వల్లవి పోర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్లో ఏం జరిగిందో, పిల్లలు ఇంత హింసాత్మకంగా ప్రవర్తించేందుకు కారణమేందో తేల్చాలని పోలీసులను కోరారు. వీడియో గేమ్​లే ఇందుకు కారణమా అని అనుమానం వ్యక్తం చేశారు. 

తన కొడుకుపై దాడికి కారణమేందని అడిగితే స్కూల్ మేనేజ్​మెంట్ స్పందించలేదని, క్లాస్ రూం సీసీటీవీ ఫుటేజీ అడిగినా ఇవ్వలేదని బాధిత చిన్నారి తండ్రి తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.