
స్కూల్ బస్సు కిందపడి మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన సికింద్రాబాద్ జవహర్నగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. సోదరుడికి తోడుగా స్కూల్ బస్సు వద్దకు వచ్చిన చిన్నారి భవిష్య.. ప్రమాదవశాత్తు రచన గ్రామర్ హైస్కూల్ బస్సు ముందు చక్రాల కింద పడి మృతి చెందింది. బస్సు డ్రైవర్ ప్రవీణ్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు అంటున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.