అలసి పోయి వచ్చింది : ఇంట్లోనే సేద తీరుతున్న పులి

అలసి పోయి వచ్చింది : ఇంట్లోనే సేద తీరుతున్న పులి

గౌహతి: పులిని చూస్తేనే సగం చస్తాం. అలాంటిది ఓ పులి ఇంట్లోకి వచ్చి బెడ్ పై పడుకుంటే ఇంకేముందు. ఊహిస్తేనే భయంతో వణికిపోయే ఈ సంఘటన అసోంలో నిజంగానే జరిగింది. అసోంను ఎడతెగని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరద ప్రవాహాలు పోటెత్తడంతో కజిరంగా జాతీయ పార్కు మొత్తం అస్తవస్తం అయింది. జంతు జీవనానికి తీవ్ర విఘాతం ఏర్పడింది. ఇప్పటికే పలు జంతువులు మృతిచెందగా ఎన్నో జంతువులు ఆవాసాల్ని కోల్పోయి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వరదల కారణంగా నిరాశ్రయం చెందిన పలు జంతువులు సమీప ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. ఈ క్రమంలోనే రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ ఓ ఇంట్లోకి ప్రవేశించింది.

అలసిన శరీరంతో బెడ్‌ పై సేదతీరింది. గదిలో పులి ఉండటాన్ని గమనించిన ఇంటి యజమాని ఆశ్చర్యానికి గురయ్యాడు. వరదల కారణంగా జంతువులు ఏ విధంగా ఆహారానికి ఇబ్బందులు పడుతున్నాయో ఈ ఘటన ఊదాహరణ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సమాచారం తెలిసిన అటవీశాఖ అధికారులు పులికి మత్తు ఇంజిక్షన్‌ ఇచ్చి రెస్క్యూ చేయనున్నట్లు తెలిపారు. పులిని ఉన్న ఇంటికి తాళం వేసి, పక్క ఇంట్లో జీవనం సాగిస్తున్నట్లు తెలిపాడు ఇంటి యజమాని. ఈ విషయం తెలియడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే పులి అలసిపోయి ఉన్నందున్న ఎలాంటి ప్రమాదం జరగదని గ్రామస్థులు గ్రహించారు.