మహాదేశ్వర కొండల అభయారణ్యంలో ఆడపులి,4 పిల్లలు మృతి

మహాదేశ్వర కొండల అభయారణ్యంలో ఆడపులి,4 పిల్లలు మృతి

కర్ణాటకలోని మలే మహదేశ్వర కొండల వన్యప్రాణుల అభయారణ్యంలో ఒక పులి, దాని నాలుగు పిల్లలు చనిపోయాయని గుర్తించారు. అటవీ అధికారుల తెలిపిన వివరాల ప్రకారం..పులులను చంపడానికి ఆవు కళేబరంలో విషం కలిపినట్లు అనుమానిస్తున్నారు. చనిపోయిన పులుల శవ పరీక్ష శుక్రవారం (జూన్​ 27) నిర్వహించారు. ఓకేసారి, ఒకేప్రాంతంలో పులి, దాని నాలుగు పిల్లలు చనిపోవడంపై చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు. మూడు రోజుల్లో నివేదిక రానుంది. 

560 కంటే ఎక్కువ పులులతో కర్ణాటక దేశంలో రెండవ స్థానంలో ఉంది. ప్రాజెక్ట్ టైగర్ కింద రాష్ట్రంలో పులుల జనాభాను పెంచేందుఉ కర్ణాటక అటవీశాఖ దృఢ సంకల్పంతో పనిచేస్తుందని రాష్ట్ర అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రే చెప్పారు. 

కర్ణాటకలోని మలే మహదేశ్వర హిల్స్ వన్యప్రాణుల అభయారణ్యంలోని హూగ్యం అటవీ ప్రాంతంలో గురువారం ఆడపులి,దాని నాలుగు పిల్లలు చనిపోయాయని అధికారులు గుర్తించారు. ఒకే చోట ఒకే రోజు రాష్ట్రంలోనే అత్యంత దారుణమైన పులి మరణాలపై అనుమానం వ్యక్తం చేశారు అటవీ శాఖ అధికారులు. ఆ పులి కొన్ని రోజుల క్రితం ఒక ఆవును చంపిందని అటవీ అధికారులు తెలిపారు. ఆవు కళేబరంలో విషం కలిపి ఉంటుందని భావిస్తున్నారు అధికారులు.- ఆ ఎరను తిన్న తర్వాత పులి ,దాని పిల్లలు చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 

రాష్ట్ర అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఈ మరణాలను అసహజమైనవి అని విచారణకు  ఆదేశించారు. మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాల్సి ఉంది. ఎంఎం హిల్స్ దాని చుట్టుపక్కల ప్రాంతాలలో గ్రామాల్లో వన్యప్రాణుల సంచారం, దాడులు జరుగుతుండటంలో కొంతమంది గ్రామస్తులను విషప్రయోగం,ఉచ్చుతో సహా ప్రతీకార చర్యలకు దారి తీస్తుందని అధికారులు చెబుతున్నారు. 

పులుల సంరక్షణలో మొదటి రెండు రాష్ట్రాల్లో కర్ణాటక ఉంది. 563 పులులతో మధ్యప్రదేశ్​ తర్వాత దేశంలో రెండు స్థానంలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పులుల ఆవాసాలు ఒత్తిడిలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మలే మహదేశ్వర కొండ వన్యప్రాణుల అభయారణ్యం 906 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.పులులు, ఏనుగులు, చిరుతలు ,ఇతర రకాల వన్యప్రాణులకు నిలయంగా ఉంది.