తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. స్వామి వారి దర్శనం కోసం 30 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 77 వేల 326 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 4 కోట్ల 36 లక్షలు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. 38 వేల 742 మంది భక్తులు స్వామివారికి తల నీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.