తిరుమల ఘాట్ రోడ్ లో కారు ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డులో 24వ మలుపు దగ్గర కారు బోల్తా పడింది. ఈ ఘటనలో భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వర్షంలో తిరుమల నుండి తిరుపతికి వెళుతుండగా 30 మలుపు వద్ద పిట్టగోడను కారు ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన వారిని టీటీడీ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.