తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భక్తులు.. దర్శనానికి 24 గంటలు

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భక్తులు.. దర్శనానికి 24 గంటలు

తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ నెలకొంది. మొన్నటి వరకు వేసవి సెలవులు కావడంతో కొండ కిటకిటలాడింది. క్యూ కాంప్లెక్స్ లు, అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో  నిండిపోయి.. వెలుపలికి కూడా క్యూ లైన్లు వచ్చాయి.  జూన్ రెండో వారంలో స్కూళ్లు తెరచుకోవడం... ఆ తరువాత ఆషాఢమాసం కూడా కావడంతో వెంకన్నకు భక్తుల తాకిడి కాస్త తగ్గింది.  మళ్లీ ఇప్పుడు వీకెండ్ కావడంతో అమాంతంగా భక్తుల రద్దీ పెరిగింది.  శుక్రవారం(జూన్ 30) వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టు మెంట్లన్నీ నిండి.. క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది.

గురువారం (జూన్ 29)స్వామివారిని 62,005 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 34,127 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు తీర్చుకున్నారు. గురువారం (జూన్ 29)శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.75 కోట్లు వచ్చినట్లు టీటీడీ పేర్కొంది. భక్తులకు అన్నపానీయాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది.