
- కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన టీజేఎస్ నాయకులు
నల్లగొండ అర్బన్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని , పెన్షన్ తో పాటు ఇంటి స్థలం వెంటనే మంజూరు చేయాలని టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం నల్గొండలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్ ఇల త్రిపాఠి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్షలాదిమంది పోరాట ఫలితంగా తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఉద్యమకారులను ఉద్దేశపూర్వకంగా విస్మరించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యమకారులకు న్యాయం చేయాలన్నారు.
గుర్తింపు కార్డులను ఇవ్వాలని కోరారు. ప్రతి ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలం, హెల్త్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నరసింహచారి, సాగర్, నాగేశ్వరరావు, యాదగిరి, వెంకటేశం, జి యాదగిరి, ఎల్ క్రాంతి కుమార్, వీర నాయక్, బి నర్సింలు, శ్రీనివాసులు, కల్లూరి అయోధ్య తదితరులు పాల్గొన్నారు.