టీఎంసీ నాయకుడిని కాల్చి చంపిన దుండగులు

టీఎంసీ నాయకుడిని  కాల్చి చంపిన దుండగులు

పశ్చిమ బెంగాల్​లో టీఎంసీ నేత దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ పరగణాస్ జిల్లాకి చెందిన జియారుల్​మొల్లా తృణమూల్​ కాంగ్రెస్ సభ్యుడు.  గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను జులై 1న  కాల్చారు. బసంతిలోని ఓ గ్రామంలో రోడ్డు పక్కన అచేతనంగా పడి ఉన్న ఆయన్ని స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే బాధితుడు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. 

యువజన టీఎంసీ సభ్యుడైన ఆయనకి నిత్యం బెదిరింపులు వచ్చేవని బాధిత కుటుంబం తెలిపింది. మొల్లా కుమారుడు మాట్లాడుతూ.. 'మా నాన్నకు చాలా మంది శత్రువులు ఉన్నారు. పార్టీలోని మరో వర్గం ఆయనను చాలా సార్లు బెదిరించింది. వివిధ ఫోన్​నంబర్లలో బెదిరింపు కాల్స్ వచ్చేవి.' అని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.