పార్లమెంట్ వద్ద కళ్లకు గంతలు కట్టుకుని టీఎంసీ ఎంపీల నిరసన

పార్లమెంట్ వద్ద కళ్లకు గంతలు కట్టుకుని టీఎంసీ ఎంపీల నిరసన

ఢిల్లీ అల్లర్ల  సెగలు  పార్లమెంట్ ను  తాకాయి. పార్లమెంట్  ఆవరణలోని మహాత్మ గాంధీ  విగ్రహం  దగ్గర  టీఎంసీ ఎంపీలు  ఆందోళన చేశారు. కళ్లు కనిపించకుండా  గంతలు కట్టుకున్న ఎంపీలు…ముక్కుపై  వేలు వేసుకుని  నిరసన తెలిపారు.  చెడు చూడవద్దు,  చెడు మాట్లాడవద్దు  అనే గాంధీ  సందేశం కనిపించేలా  టీఎంసీ ఎంపీలు  నిరసన తెలిపారు. ఆప్ ఎంపీలు  కూడా గాంధీ విగ్రహం  దగ్గర నిరసనకు దిగారు.