- కండిషన్ల మేరకేనని స్పష్టం చేసిన సీఎం పళనిస్వామి
చెన్నై: లాక్డౌన్ రూల్స్ సడలింపుల్లో భాగంగా ఎంటర్టైన్ మెంట్ రంగంలో షూటింగ్లకు తమిళనాడు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇప్పటికే లాక్ డౌన్ 5 రూల్స్, గైడ్ లైన్స్ విడుదల చేసిన పళనిస్వామి ప్రభుత్వం నేటి(ఆదివారం) నుంచి సీరియల్స్ షూటింగ్స్ జరుపుకోవచ్చని ప్రకటించింది. అయితే, మ్యాగ్జిమమ్ 60 మందితో టెలివిజన్ షోల షూటింగ్లను ప్రారంభించాలని కండిషన్ పెట్టింది. గరిష్టంగా 20 మందితో టీవీ కార్యక్రమాల ఇండోర్ షూటింగ్ కు ప్రభుత్వం ఇప్పటికే అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఫెఫ్సీ అధ్యక్షుడు, బుల్లితెర నిర్మాత మండలి సభ్యుల విజ్ఞప్తుల మేరకు 60 మంది సభ్యులతో సీరియల్స్ షూటింగులు జరుపుకోవడానికి సీఎం తాజాగా అనుమతించారు. షూటింగ్ స్పాట్లో హ్యాండ్ వాష్, మాస్కులు కట్టుకోవడం, టెంపరేచర్ టెస్ట్ చేసిన తర్వాతే ప్రతి ఒక్కరినీ లోనికి అనుమతించేలా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వెహికల్స్ తో పాటు షూటింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని కూడా శానిటైజ్ చేయాలని చెప్పారు.