దేశంలో కొత్త‌గా 16,922 కేసులు..418 మంది మృతి

దేశంలో కొత్త‌గా 16,922 కేసులు..418 మంది మృతి

కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 4,73,105 
మృతుల సంఖ్య మొత్తం 14,894
1,86,514 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
కోలుకున్న వారు 2,71,697 మంది

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో అత్య‌ధికంగా 16, 922 కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపింది కేంద్ర వైద్యారోగ్య‌శాఖ‌. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసులు సంఖ్య 4 ల‌క్ష‌ల 73 వేల 105కి చేర‌గా..ఇందులో ల‌క్షా 86 వేల 514 మంది ట్రీట్ మెంట్ తీసుకుంటున్నార‌ని తెలిపింది. 24 గంట‌ల్లో 13,012 మంది డిశ్చార్జ్ కాగా..ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి 2 ల‌క్ష‌ల 71 వేల 697 మంది కోలుకున్నార‌ని చెప్పింది. క‌రోనా వైర‌స్ తో ఒక రోజులో 418 మంది మృతి చెంద‌గా, ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 14,894 క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌ని తెలిపింది కేంద్ర ఆరోగ్య‌శాఖ‌.

మ‌రిన్ని వార్త‌ల కోసం