
ఈ వారం (గురు, శుక్ర) థియేటర్లో సినిమాల సందడి నెలకొంది. నిన్న (జూన్ 5న) కమల్ హాసన్-మణిరత్నం థగ్లైఫ్ మూవీ థియేటర్కు వచ్చి మోత మోగిస్తోంది. కమల్-శింబుల స్వాగ్తో ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆడియన్స్ను తెగ అలరిస్తోంది. మాస్ ఫీస్ట్ జనాలతో విజిల్స్ కొట్టిస్తోంది.
ఈ తరుణంలోనే చిన్న సినిమాలు మాకేంటీ తక్కువ అనేలా? నేడు (జూన్ 6న) తెలుగు సినిమాలు సందడి చేయనున్నాయి. మరి ఆ సినిమాలేంటీ? వాటీ జోనర్ ఏంటనేది ఓ లుక్కేద్దాం.
ఈ వారం గురు, శుక్రవారాల్లో థియేటర్ లో సినిమాల సందడి నెలకొంది. నిన్న (జూన్ 5న) కమల్ హాసన్-మణిరత్నం థగ్లైఫ్ మూవీ థియేటర్కు వచ్చి మోత మోగిస్తోంది. కమల్-శింబుల స్వాగ్ తో ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆడియన్స్ ను తెగ అలరిస్తోంది. మాస్ ఫీస్ట్ జనాలతో విజిల్స్ కొట్టిస్తోంది. ఈ తరుణంలోనే చిన్న సినిమాలు మాకేంటీ తక్కువ అనేలా? నేడు జూన్ 6న తెలుగు సినిమాలు సందడి చేయనున్నాయి. మరి ఆ సినిమాలేంటీ? వాటీ జోనర్ ఏంటనేది ఓ లుక్కేద్దాం.
‘గ్యాంబ్లర్స్’:
సంగీత్ శోభన్ ‘గ్యాంబ్లర్స్’అనే ఓ మిస్టరీ థ్రిల్లర్తో నేడు (జూన్ 6న) ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇందులో సంగీత్ శోభన్కు జోడిగా ప్రశాంతి చారులింగా నటించింది. ఈ సినిమాలో పేకాటలో ఆరితేరిన వ్యక్తి పాత్రలో సంగీత్ నటించాడు.అతను పేకాటలో వేసే ఎత్తులు, అతన్ని వెంటాడానికి వచ్చే ఓ 5 గురు మిస్టరీయస్ వ్యక్తులు, మధ్యలో డైమండ్ కోసం ఒకరికొకరు ఎలా తలపడ్డారు? ఎవరు ఎవర్ని మోసం చేశారు అనేది మిగతా స్టోరీ!
శ్రీశ్రీశ్రీ రాజావారు:
నార్నే నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’.సంపద హీరోయిన్. ‘శతమానం భవతి’ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో చింతపల్లి రామారావు నిర్మించారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జోనర్లో తెరకెక్కింది. ఈ మూవీ నేడు (జూన్ 6న) థియేటర్స్లో విడుదలైంది.
బద్మాషులు:
మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్లో శంకర్ చేగూరి తెరకెక్కించిన మూవీ ‘బద్మాషులు’.తార స్టోరీ టెల్లర్స్ బ్యానర్పై బి. బాలకృష్ణ, సి.రామ శంకర్ నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే ఈ కుటుంబ కథా చిత్రం నేడు (జూన్ 6న) దీపా ఆర్ట్స్ ద్వారా ఈ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
పాడేరు 12వ మైలు:
సత్యం రాజేష్ లీడ్ రోల్లో రూపొందిన చిత్రం ‘పాడేరు 12వ మైలు’.సుహాన హీరోయిన్గా నటించగా శ్రవణ్, కాలకేయ ప్రభాకర్ కీలక పాత్రలు పోషించారు. ఎన్.కె దర్శకత్వంలో గ్రంధి త్రినాధ్ నిర్మించారు. ఇవాళ (జూన్ 6న) థియేటర్స్ లో మూవీ విడుదలైంది. సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ మూవీ తెరకెక్కింది.
‘హౌస్ఫుల్ 5’:
హౌస్ఫుల్ ఫ్రాంచైజీ ఏ రేంజ్లో సక్సెస్ అయ్యిందో తెలిసిందే. స్టార్ కాస్ట్తో భారీ బడ్జెట్తో ఇప్పటికే నాలుగు పార్ట్స్ నిర్మించాడు సాజిద్ నడియాడ్వాలా. సక్సెస్ ఫుల్ కామెడీ మూవీ సీరీస్ గా తెరకెక్కిన లేటెస్ట్ హౌస్ ఫుల్ సీజన్ 5.. నేడు (జూన్ 6న) విడుదలైంది.
తరుణ్ మన్సుఖానీ డైరెక్ట్ చేసిన హౌస్ ఫుల్ 5 కామెడీ, థ్రిల్లింగ్, సస్పెన్స్, మిస్టరీతో తెరకెక్కింది. ఇందులో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ముఖ్, జాన్ అబ్రహామ్, బాబీ డియోల్ పెద్ద స్టార్ క్యాస్టే నటిస్తోంది. టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డేతో పాటు కృతీ సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫిమేల్ లీడ్స్గా కనిపించనున్నారు.