ఏపీలో 2618 కరోనా కేసులు నమోదు

ఏపీలో 2618 కరోనా కేసులు నమోదు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,618 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 88 వేల 780 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,618 కేసులు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. ఇవాళ్టితో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8 లక్షల 25 వేల 966కు చేరుకున్నట్లు ఏపీ వైద్య రోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి కొత్తగా 3,509 మంది కోలుకోగా.. క్వారెంటైన్.. చికిత్స అనంతరం మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 7 లక్షల 95 వేల 592గా నమోదు అయింది. గడచిన 24 గంటల్లో కరోనాతో 16 మంది మృతి చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 6 వేల 706కు చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 23 వేల 668 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 81 లక్షల  17 వేల 685 మందికి కరోనా శాంపిల్స్‌ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.