ఇవాళ గురుకుల డిగ్రీ, ఇంటర్ ఎంట్రన్స్ టెస్ట్

ఇవాళ గురుకుల డిగ్రీ, ఇంటర్ ఎంట్రన్స్ టెస్ట్
  • 65 వేలకు పైగా అప్లికేషన్లు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లకు ఆదివారం నిర్వహించనున్న ఎంట్రన్స్ టెస్ట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలంగాణ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల సొసైటీ సెక్రటరీ సైదులు తెలిపారు. 2024–-25 అకడమిక్ ఇయర్ కు అడ్మిషన్ కోసం నిర్వహించే ప్రవేశపరీక్ష కోసం 47,461 అప్లికేషన్లు  వచ్చాయని శనివారం పత్రిక ప్రకటనలో ఆయన చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 209 కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్ష ఆదివారం   ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. హాల్ టికెట్లు వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకొని పరీక్ష కేంద్రం వివరాలు ముందుగానే సరిచూసుకోవాలని, నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రానికి రావాలని ఆయన సూచించారు.