ఇవాళ కడప జిల్లాలో జగన్ పర్యటన

ఇవాళ కడప జిల్లాలో జగన్ పర్యటన

ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి  ఇవాళ  సీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం జగన్ 9.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం వెళ్తారు. అక్కడి నుంచి11:00 గంటలకు కడప విమానాశ్రయం చేరకుని 11:30 గంటల నుండి 11: 45 వరకు కడప నగరంలోని ప్రఖ్యాత పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. 12:15 గంటలకు కడప నుండి పులివెందులకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వెళ్లి అక్కడ సీఎస్ఐ చర్చిలో  ప్రార్థన చేయనున్నారు.అనంతరం అక్కడి నుంచి 1:30 గంటలకు ఇడుపులపాయకు వెళ్లి అయి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి సాయంత్రం 4:30 వరకు ఇడుపులపాయలో గడపనున్నారు.తర్వాత 4:30 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానం ద్వారా విజయవాడ వెళ్లనున్నారు.జగన్ టూర్ కు సంబంధించిన ఏర్పాట్లను  జిల్లా కలెక్టర్ హరికిరణ్ పర్యవేక్షిస్తున్నారు. .