తెలంగాణ కొత్త సచివాలయం వివాదాలకు నిలయంగా మారుతోంది. ఇప్పటికే మీడియాకు నో ఎంట్రీ అన్న ప్రభుత్వం ఇప్పుడు మరో అపవాదు మూటగట్టుకుంది. కొత్త సచివాలయాన్ని చూసేందుకు రోజుకు 300 మంది విజిటర్స్కు పాస్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మే2 వ తేదీ నుంచి విజిటర్స్ పాస్లు ఇస్తామని ప్రకటించారు.
ఈ రోజు ( మే2) కొత్త సచివాలయాన్ని చూసేందుకు కొంతమంది విజిటర్స్ వచ్చారు. అధికారులు 100 మందికే ఇచ్చారు. ప్రస్తుతం లోపల సీఎం ఉన్నారని .. ఇంతకు మించి పాస్లు ఇచ్చేందుకు కుదరదని అధికారులు తెగేసి చెబుతున్నారు.
పేదల ప్రభుత్వమని చెప్పే కేసీఆర్...ఆయన సచివాలయంలో ఉండగా సామాన్యులకు ప్రవేశం లేదా కొంతమంది చర్చించుకుంటున్నారు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కి... ప్రజా సొమ్ముతో నిర్మించిన సెక్రటేరియేట్ను కనీసం చూసేందుకు కూడా అనుమతి లేదా ప్రజలు వాపోతున్నారు. కేసీఆర్ ఉంటే సచివాలయంలోకి విజిటర్స్ను ఎందుకు అనుమతించరని ప్రశ్నిస్తున్నారు.